మహిళా CEO సుచానా సేథ్ అరెస్ట్  
వార్తలు

సుచానా సేథ్ కేసు: 'నా కుమారుడి ముఖం నా భర్తను గుర్తు చేస్తుంది..!' - కొడుకును చంపిన CEO!

Telugu Editorial

గత వారం గోవాలో బెంగళూరుకు చెందిన మహిళా CEO సుచానా సేథ్ తన నాలుగేళ్ల కుమారుడిని హత్య చేసి శవాన్ని ట్యాక్సీలో తీసుకెళ్తుండగా మార్గమధ్యంలో పట్టుబడ్డారు. ఆవిడని పట్టుకునేందుకు ట్యాక్సీ డ్రైవర్, ఆమె బస చేసిన హోటల్ సిబ్బంది పోలీసులకు సహకరించారు. సుచానా సేథ్ ను పోలీసులు అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు. ప్రతి వారం తన కుమారుడిని చూసేందుకు తన భర్తకు కోర్టు అనుమతి ఇవ్వడంతో సుసానా అప్పటికే కలత చెందింది. సుచానా సేథ్, తన భర్త కొన్నేళ్ళకి ముందే విడిపోయారు. బిడ్డ సుసానా వద్ద ఉన్నప్పటికీ, భవిష్యత్తులో బిడ్డను తన తండ్రికి అప్పగించాలని కోర్టు ఆదేశిస్తుందేమోనన్న భయం సుచానాకు ఉన్నట్లు తెలుస్తోంది.

గోవాలో ఆమె, ఆమె కుమారుడు ఉంటున్న గదిలో సుసానా చేతిరాతతో రాసిన టిష్యూ పేపర్ లభ్యమైంది. అందులో ఐదు లైన్లు రాసి ఆ కాగితాన్ని నలిపి పారేసే ప్రయత్నం చేసారు. ఇది ఫోరెన్సిక్ పరీక్షలో పట్టుబడింది. ఆమె రాసిన పంక్తుల్లో తన కొడుకు హత్యకు గురైనప్పుడు తన మానసిక స్థితిని ప్రతిబింబిస్తున్నాయని పోలీసులు తెలిపారు.

సుచానా రాసిన లేఖతో పాటు చేతిరాత నమూనాను పరీక్షలకు పంపారు. తన కొడుకు తన భర్తను చూడటాన్ని తాను అంగీకరించలేకపోతున్నానని ఆమె లేఖలో పేర్కొన్నారు.

అయితే అందులో ఏముందో పూర్తిగా చెప్పడం సరికాదని పోలీసులు తెలిపారు. గోవాలో ఆమె బస చేసిన గదిలో రెండు ఖాళీ దగ్గు సిరప్ బాటిళ్లు కనిపించాయి.

Suchana Seth

తన కుమారుడికి అధిక మోతాదులో మందులు ఇచ్చి చంపడానికి కొనుగోలు చేశారేమో అనే కోణంలో పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. ఈ హత్యను ఆమె ముందే ప్లాన్ చేసి చేసుండొచ్చని పోలీసు అధికారి ఒకరు తెలిపారు.

తన కొడుకు తన భర్తలా కనిపిస్తున్నాడని ఆమె తన స్నేహితులతో చెప్పినట్లు తెలిసొచ్చింది. హత్యకు అది కూడా ఒక కారణం అయుండచ్చు. అయితే సుచానా తన కొడుకును ఎక్కువగా ప్రేమిస్తోందని ఆమె ఇంటి పక్కనే నివసించే వారు చెప్పారు.