సింగర్ భవతారిణి క్యాన్సర్ కారణంగా 47 ఏళ్లలో కన్నుమూశారు! 
వార్తలు

ఇళయరాజా కుమార్తె, సింగర్ భవతారిణి క్యాన్సర్ కారణంగా 47 ఏళ్లలో కన్నుమూశారు!

Meenakshi Gopinathan

ఇళయరాజా కుమార్తె, జాతీయ అవార్డు గ్రహీత సింగర్ భవతారిణి (47) ఈరోజు కన్నుమూశారు. గత కొంతకాలంగా భవతరణి అనారోగ్యంతో బాధపడుతున్నట్లు తెలిసింది. ఆమె క్యాన్సర్‌ తో బాధపడుతూ వైద్య చికిత్స పొందుతోంది పరిస్థితి విషమించడం వల్ల శ్రీలంకలోని ఓ ప్రైవైట్​ ఆస్పత్రిలో చేర్పించి చికిత్స అందించారు. అక్కడే తుది శ్వాస విడిచారు భవతారిణి. జనవరి 26 సాయంత్రం ఆమె భౌతికకాయం చెన్నైకి రానున్నట్లు తెలిసింది. అనంతరం అంత్యక్రియలు నిర్వహించనున్నారు. ఆమె మరణవార్త తెలిసిన సినీ ప్రముఖులు దిగ్భ్రాంతి వ్యక్తం చేస్తున్నారు. సుదీర్ఘ విరామం తర్వాత భవతారిణి మూడు చిత్రాలకు సంగీతం అందించడం గమనార్హం.

Bhavatharini