జాతీయం

రాముడి రాకతో పెద్ద మార్పు వచ్చింది - నటి రేవతి ఇంస్టాగ్రామ్ పోస్ట్...నటి నిత్యమేనేన్ కామెంట్!

Telugu Editorial
అయోధ్యలో రామ మందిర ప్రారంభోత్సవం సోమవారం (జనవరి 22) ఘనంగా జరిగింది.

అమితాబ్ బచ్చన్, రజినీకాంత్, ధనుష్, మాధురీ దీక్షిత్, రణ్బీర్ కపూర్, అలియా భట్, విక్కీ కౌశల్, కత్రినా కైఫ్, కంగనా రనౌత్, క్రీడాకారుడు సచిన్ టెండూల్కర్ తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ కార్యక్రమానికి వ్యక్తిగతంగా హాజరు కాలేకపోయిన పలువురు సెలబ్రిటీలు, రాజకీయ నాయకులు సోషల్ మీడియా ద్వారా 'జై శ్రీరామ్' అంటూ తమ మద్దతును, మనోభావాలను తెలియజేశారు.

నటి రేవతి..

అయోధ్య రామ మందిర ఉత్సవాన్ని నా జీవితంలో మరచిపోలేని రోజు అని రేవతి ఇన్స్టాగ్రామ్లో రాసుకొచ్చారు. బాల రాముని ముఖం చూడగానే నాకు చాలా సంతోషం కలిగింది.

విచిత్రమేమిటంటే హిందువుగా జన్మించడం వల్ల మన నమ్మకాలను మనలోనే ఉంచుకున్నాము ఇతరుల నమ్మకాలను దెబ్బతీయకూడదనే ఉద్దెశంతో మన భావోద్వేగాలను నియంత్రించడానికి ప్రయత్నించాము. లౌకిక భారతావనిలో మన ఆధ్యాత్మిక నమ్మకాలను మనలోనే ఉంచుకున్నాము.

శ్రీరాముని రాకతో ఎన్నో మార్పులు వచ్చాయి. ఇప్పుడు తొలిసారిగా మనం శ్రీరాముని భక్తులమని బిగ్గరగా చెబుతున్నాం. జై శ్రీరామ్!"

ఈ పోస్ట్ ని సమర్ధించి నటి నిత్యమేనేన్ కామెంట్ పెట్టడంతో పలువురు నెటిజన్లు తమ మద్దతు, విమర్శలను వ్యక్తం చేస్తూ రేవతి చేసిన ఈ ఇన్స్టాగ్రామ్ పోస్ట్ను నిత్యమేనేన్ కామెంట్ ను వైరల్ చేస్తున్నారు.